కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. టిడ్కో ఇళ్ల పంపిణీ సందర్భంగా కడపలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. దీంతో మాధవిరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. కార్యక్రమంలో భాగంగా వేదికపైకి మంత్రిని ఆహ్వానించిన తర్వాత.. ప్రోటోకాల్ ప్రకారం తనను పిలవాలని.. కానీ జాయింట్ కలెక్టర్ను పిలవటం ఏమిటంటూ మాధవిరెడ్డి మండిపడ్డారు. ప్రోటోకాల్ తెలియదా అంటూ వేదికపైనే సీరియస్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.