‘ప్లీజ్.. మమ్మల్ని రక్షించండి’.. కామారెడ్డిలో భారీ వర్షాలకు పూర్తిగా మునిగిపోయిన జి.ఆర్ కాలనీ

6 months ago 3
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. జి.ఆర్. కాలనీ పూర్తిగా నీట మునిగింది. దీంతో తమను కాపాడాలంటూ వీడియోలను సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపైకి చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సహాయక చర్యలు చేపట్టారు. వరదల వల్ల వరి, మక్కజొన్న, పత్తి పంటలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Entire Article