Smita Sabharwal: స్మిత సబర్వాల్.. తెలంగాణలో సుపరిచితమైన ఐఏఎస్ అధికారిణి. కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి హోదాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన పర్యటనలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇటీవల ప్రభుత్వానికి మింగుడుపడని చర్యలతో కూడా ట్రెండింగ్లో ఉంటున్నారు. ఐఏఎస్ అధికారుల బదిలీల్లో స్మిత సబర్వాల్ను పర్యటక శాఖ నుంచి ఆర్థిక శాఖకు బదిలీ చేశారా. ఈ నేపథ్యంలో భగవద్గీతలోని శ్లోకాన్ని ట్వీట్ చేశారు స్మిత సబర్వాల్.