తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్తో పాటు పలువురు నిందితులుగా ఉన్నారు. అయితే, తాజాగా, ఐఏఎస్ అధికారిని ప్రాసిక్యూషన్కు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో కేసు విచారణలో ఏసీబీ మరింత దూకుడుగా వ్యవహరించనుంది. ఐఏఎస్ అధికారులను విచారించాలంటే కేంద్ర సిబ్బంది వ్యవహారాల విభాగం నుంచి అనుమతి తప్పనిసరి.