ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం.. ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

6 months ago 8
తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్యలు చేపట్టారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే తాను పార్టీ మారలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశానని కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article