Secretariat jobs Cheating in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్లో ఫేస్బుక్ పోస్టును నమ్మి నిరుద్యోగులు మోసపోయారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సుజిత్ అనే వ్యక్తి ఏడుగురు నిరుద్యోగుల నుంచి రూ.53 లక్షలు వసూలు చేశాడు. నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మోసం చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు సుజిత్ అనారోగ్యంతో ఉన్నారని.. కోలుకున్నాక అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.