Raghu Rama Krishna Raju Rs Thousand Fine: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ప్రజలకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అలర్ట్ చేశారు. ఉండి నియోజకవర్గంలో ఎవరైనా పంట కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను వేస్తే వారికి రూ.1000 జరిమానా విధిస్తామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే మంచి లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.ఈ జరిమానా ద్వారా వచ్చిన మొత్తాన్ని కెనాల్ డెవలప్ మెంట్ ఫండ్ (కాలువ అభివృద్ధి నిధి)కి జమ చేసి, పంట కాలువలను శుభ్రం చేసేందుకు వినియోగిస్తామన్నారు.