తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉండగా.. భారత్ రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన క్రమంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.