తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే విచారణ కొనసాగుతుండగా.. బాధితుల జాబితాలో పలువురు ప్రముఖ నటులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జబర్దస్త్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో పవిత్ర లోకేశ్ సహా పలువురు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయని వార్తలు రాగా.. ఈ జాబితా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.