ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిట్ అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, ప్రభాకర్ రావు అరెస్టు కాకుండా ఉన్న వెసులుబాటును కొట్టేయాలని సిట్ సుప్రీం కోర్టును కోరింది. ఈ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్కు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. సిట్ దర్యాప్తు కొనసాగుతోంది, బాధితుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు.