హైదరాబాద్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో పారదర్శకత కోసం జీహెచ్ఎంసీ కొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది. నకిలీ సర్టిఫికెట్ల జారీని అరికట్టేందుకు, మొబైల్, వెబ్ ఆధారిత సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS) ను అమలు చేయనుంది. ఈ ప్రాజెక్ట్కు పురపాలక శాఖ ఆమోదం తెలిపింది. ఈ విధానం వల్ల మీ సేవా కేంద్రాలపై ఆధారపడకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా, సీఆర్ఎస్ సేవలు ఉచితం కావడంతో జీహెచ్ఎంసీకి ఏటా రూ.5 కోట్ల వరకు ఆదా అవుతుంది.