ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు బయలుదేరారు. సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో శనివారం అర్ధరాత్రి బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన ప్రయాణమయ్యారు. ఎప్పుడూ సాధారణ దుస్తుల్లో కనిపించే జగన్.. ఈసారి జీన్ షర్ట్, షూస్ ధరించి సరికొత్త లుక్లో కనిపించడం విశేషం. మే 15 వరకు ఈ పర్యటన కొనసాగనుండగా.. ఆ తర్వాత ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.