హైదరాబాద్లోని ఫ్యూచర్సిటీ నుండి ఏపీ రాజధాని అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టు డీపీఆర్ కోసం కన్సల్టెన్సీ నియామక ప్రక్రియ మొదలైంది. అక్టోబరు నాటికి డీపీఆర్ ప్రక్రియ కోసం కంపెనీని నియమించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) యోచిస్తోంది. 4/6 వరుసల రహదారికి అలైన్మెంట్, భూసేకరణ వివరాలను కన్సల్టెన్సీ రూపొందిస్తుంది.