తెలంగాణలో రూ.60,799 కోట్లతో రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు జరుగుతున్నాయని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్-విజయవాడ హైవేను 8 వరుసలకు విస్తరించడంతో పాటు, భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బందరు పోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే ప్రతిపాదనలున్నాయన్నారు. రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి రూ.36 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.