ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై స్టే ఇచ్చేందుకు చెన్నై ఎన్జీటీ నిరాకరించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే ఫ్యూచర్ సిటీని ప్రభుత్వం చేపడుతోందని పిటిషనర్ వాదించగా.. అది ఇంకా తొలి దశలోనే ఉందని.. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని ప్రభుత్వం తరఫు లాయర్ వాదించారు. అయితే నిబంధనలను ఉల్లంఘించి ఎక్కడా పనులు చేయబోమని ఎన్జీటీకి ప్రభుత్వం తరఫు లాయర్ వివరించారు. దీంతో ఈ పిటిషన్పై విచారణను ఎన్జీటీ వాయిదా వేసింది.