తెలంగాణను ఇంటర్నేషనల్ మెడికల్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని రూపొందిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో 'హెల్త్ సిటీ'ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అపోలో హాస్పిటల్ కొత్త శాఖను ప్రారంభించిన ఆయన.. విదేశీ రోగుల కోసం విమానాశ్రయం నుంచి ఆసుపత్రులకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సృష్టించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.