రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఇక్కడ భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని.. ఫ్యూచర్ సిటీని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. మరికొన్ని గ్రామాలను ఫ్యూచర్సిటీలో కలపాలనే ప్రతిపాదన ఉందని ఈ మేరకు ఆయా గ్రామాల్లో గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేయాలన్నారు. ఇక ఫ్యూచర్ సిటీలో అతిపెద్ద బస్ టెర్మినల్, మెట్రో కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.