తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఈగల్ టీమ్ మరోసారి భారీ విజయం సాధించింది. రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద రూ. 5 కోట్ల విలువైన 935 కిలోల గంజాయిని ఖమ్మం ఈగల్ టీమ్, రాచకొండ పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. పండ్ల ట్రేలలో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఒడిశా నుండి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.