తిరుపతి జిల్లాలో కొందరు యువకులు ఫ్లైఓవర్ మీద ఫోటోలు దిగుతూ హడావిడి చేశారు. డ్రోన్ కెమెరా కంట పడటంతో పారిపోతూ పోలీసులకు చిక్కారు. విద్యార్థులని తెలియడంతో పోలీసులు మొదటిసారిగా వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. మరోవైపు అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులపై దాడి చేసి పారిపోయారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసి, ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.