AP Weather Today: ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఎండలు మండిపోయే వేసవి కాలంలో తరచుగా వానలు కురిసి కాస్త చల్లబడింది. ఇక ఈ సంవత్సరం వర్షాకాలంలో కుండపోత వానలు కురిశాయి. ఇప్పుడు శీతాకాలం మొదలైంది. అయినా సరే.. ఇప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయంటుంది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్గా మారితే నవంబర్ 28 నుంచి నాలుగు రోజుల పాటు మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.