తెలంగాణలో వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు, రేపు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో అత్యధికంగా 6.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కామారెడ్డి, మెదక్, పెద్దపల్లి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. నేడు హైదరాబాద్ నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.