Andhra Pradesh Rains Alert: ఏపీలో మూడు రోజులు పాటు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. అలాగే శనివారం రోజు పలు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.