Andhra Pradesh Rain Alert: ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడి, శుక్రవారం నాటికి తీరం దాటే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం కొనసాగుతుండగా, ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు అధిక వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేస్తోంది.