Andhra Pradesh Weather Today: ఆంధ్రప్రదేశ్లో వానలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. గురువారం నుంచి వర్షాలు మొదలవుతాయని.. ఏపీలో మాత్రం వచ్చే సోమవారం నుంచి శనివారం వరకు వర్షాలు పడతాయంటున్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు పడ్డాయి.. అక్కడ వర్షాలతో పాటుగా పిడుగులు కూడా పడ్డాయి. మందస ప్రాంతంలో పిడుగు పడి ఇద్దరు చనిపోయారు.. మరికొందరికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. నేటి వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.