ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఇది వాయుగుండంగా మారవచ్చని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయి చలిగాలులు పెరుగుతున్నాయి.