ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన రద్దైంది. ఏపీలో తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 29న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో పర్యటించాల్సి ఉంది. భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు శంకుస్థాపనతో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీ ఏపీ పర్యటన రద్దైంది.