బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో బాధితురాలి పేరు, ఫోటోలు, వివరాలు, వారి కుటుంబ నేపథ్యం వైరల్ చేయడం పట్ల పోలీసులు తీవ్ర హెచ్చరికలు చేశారు. బాధితుల వివరాలు బయటపెట్టిన వారిపై కేసులో నమోదు చేస్తున్నారు. పోక్సో కేసుల్లో మైనర్ల వివరాలు, ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం తీవ్ర నేరమని.. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు