తెలంగాణ బీజేపీలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. హుజురాబాద్లో ఓటమిపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఈటెల కౌంటర్ ఇచ్చారు. తన నియోజకవర్గంలో కొందరు వ్యతిరేకంగా పనిచేయడం వల్లే ఓట్లు తగ్గాయని బండి సంజయ్ ఆరోపించారు. దీనిపై స్పందించిన ఈటెల, ఇకపై స్ట్రెయిట్ ఫైట్ ఉంటుందని, అవమానాలను ఎదుర్కొనే ఈ స్థాయికి ఎదిగానని అన్నారు. కడుపులో కత్తులు పెట్టుకున్న వారితో పోరాడలమేన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.