కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే రక్షణ కల్పిస్తున్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ తీవ్ర ఆరోపణలు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేయకుండా పోలీసులు కాలయాపన చేస్తున్నారని.. ఒక ఐపీఎస్ భార్య హత్య కేసులో 48 గంటల్లో నిందితులను పట్టుకున్న పోలీసులు ఈ కేసులో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ కేసులో లోకల్ మీడియా తీరును కూడా ఆయన తప్పుబట్టారు.