నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ను ఎందుకు ఎత్తివేయాలో చెప్పాలని తెలంగాణ సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్లో జరిగిన 'నక్సల్స్ నరమేధం-మేథోమథనం' చర్చలో ఆయన పాల్గొన్నారు. నక్సలిజాన్ని పూర్తిగా అణచివేస్తామని, చర్చల ద్వారా పరిష్కారం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 220 జిల్లాల్లో నక్సల్స్ సమస్య ఉండగా.. మోదీ ప్రభుత్వం వచ్చాక 12 జిల్లాలకే పరిమితమైందని తెలిపారు. గతంలో నక్సల్స్ నుంచి తనకూ బెదిరింపులు వచ్చాయని ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి కాపాడినట్లు వెల్లడించారు.