బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో దారి తప్పింది ఓ మహిళ. అలా నడుచుకుంటూ దట్టమైన అడవిలోకి వెళ్లిపోయింది. భారీ వర్షంలో దాదాపు 30 గంటల పాటు అడవిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపింది. అయితే ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో.. అడవినంతా డ్రోన్తో జల్లెడ పట్టారు పోలీసులు. చివరకు కొండపై నుంచి కిందకు దిగి వస్తున్న క్రమంలో... ఆమె ఆచూకీ గుర్తించి ఇంటికి తీసుకువచ్చారు. పల్నాడు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.