చీరల పట్ల మహిళలకు అపారమైన అభిమానం ఉంటుంది. దుకాణాలకు వెళ్లినప్పుడు గంటల తరబడి చీరలను పరిశీలిస్తారు. రంగులు, అంచులు, నాణ్యత చూసి నచ్చినదాన్ని ఎంచుకుంటారు. కొన్నిసార్లు దుకాణం యజమానులను సైతం ఇబ్బంది పెట్టేలా బేరం ఆడతారు. అలాంటిది, బేరం లేకుండానే అతి తక్కువ ధరలకు చీరలు లభిస్తున్నాయంటే మహిళలు ఎందుకు ఊరుకుంటారు? అలాంటి సంఘటన ఒకటి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగింది. ఆదివారం 'ఆషాఢం సేల్' పేరుతో కేవలం రూ.35లకే చీర అందిస్తామని ఒక షాపింగ్ మాల్ ప్రకటించింది. ఈ విషయం తెలియగానే మహిళలు వందల సంఖ్యలో షాపు తెరవకముందే గేటు ముందు బారులు తీరారు.