బడి గంటకు వేళైంది. ఇన్ని రోజులు సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులు మరో వారం, పది రోజులలో స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇక పిల్లలకు కొత్త పుస్తకాలు, స్కూలు బ్యాగులు, యూనిఫాం, షూలు వంటివి కొనేందుకు వారి తల్లిదండ్రులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ సమయంలోనే మరో షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఇంధన ధరల పెంపు నేపథ్యంలో ట్రాన్పోర్టు ఫీజులను పెంచేందుకు ఆటో రిక్షా నిర్వాహకులు, స్కూలు యాజమాన్యాలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.