కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు శుభవార్త తెచ్చింది. సెమీకండక్టర్ రంగంలో రూ.14 వేల కోట్ల పెట్టుబడితో ఇండిచిప్ సెమీకండక్టర్స్ కర్నూలులో పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. ఈక్రమంలో తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ రంగం కోసం రూ.40 వేల నిధులు కేటాయించింది. దీంతో ఏపీలో సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలకు కేంద్రం నుంచి భారీగా ప్రోత్సహకాలు అందనున్నాయి. ఇప్పటికే తిరుపతి, కర్నూలులో ఈ పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించడమే కాక ఇండిచిప్ కంపెనీతో రూ.14 వేల కోట్ల పెట్టుబడికి ఎంఓయూ కుదుర్చుకున్నారు. .