బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పిందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి హైస్పీడ్ డైమండ్ కారిడార్ ప్రాజెక్టు ప్రతిపాదనలో ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల్లోనే చేరుకోవచ్చని పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్లో తెలంగాణకు రూ.5454 కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.