కేంద్ర బడ్జెట్ ద్వారా తెలంగాణకు మరో గుడ్న్యూస్ దక్కింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల స్కిల్ మెరుగుపరిచేందుకు కంటెంట్ క్రియేటర్ ల్యాబ్లు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించగా.. అందులో 500 వరకు తెలంగాణకు రానున్నాయి.