Prakasam District Son Creates Mother Fake Death Certificate: బతికున్న తల్లి చనిపోయినట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, ఆమె పేరుపై ఉన్న భూమిని కొడుకు అక్రమంగా అమ్మేసుకున్నాడు. ఆర్డీవో విచారణ చేపట్టి, వృద్ధురాలికి న్యాయం చేశారు. భూమి అమ్మకాన్ని రద్దు చేసి, తల్లి పేరును వెబ్ల్యాండ్లో తిరిగి నమోదు చేయాలని ఆదేశించారు. తల్లి సంరక్షణకు నెలనెలా రూ.15 వేలు చెల్లించాలని కొడుకును ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన జరిగింది.