భర్త బతికుండగానే భార్య నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి లక్షల్లో బీమా డబ్బులు కొట్టేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో వెలుగు చూసింది. ఈ కేసులో భార్యాభర్తలతో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మోసంలో ఇంకా ఎవరున్నారు..? నకిలీ పత్రాలు ఎలా సృష్టించారు..? అనే దానిపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.