బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తెలిపింది. అలాగే ఏపీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. 3000 టీఎంసీల గోదావరి జలాలు ఏటా సముద్రంలో కలుస్తున్నాయని.. ఇందులో 200 టీఎంసీలు ఉపయోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదించింది.