ఆంధ్రప్రదేశ్ చేపట్టిన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణలో చెలరేగిన జల వివాదంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. కొత్త ప్రాజెక్టుల కన్నా ముందు పెండింగ్లో ఉన్న హంద్రీనీవా, వంశధార ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకుండా, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడాలని ఆయన కోరారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.