బసవతారకం ఆస్పత్రి సమీపంలో రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కాపాడారు. ఆ స్థలంలో ఆక్రమణలను తొలగించారు. పార్థసారథి అనే వ్యక్తి నకిలీ పత్రాలతో ఐదెకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించమే కాక.. అక్కడ షెడ్లు నిర్మించి, వేటకుక్కలతో కాపలా పెట్టాడు. దీని గురించి స్థానికులతో పాటు జలమండలి, రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన హైడ్రా, ఆక్రమణలను తొలగించి, ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ.750 కోట్లు అని తెలుస్తోంది.