చేవెళ్ల వద్ద జరిగిన ఘోర ప్రమాదం తర్వాత బస్సు ప్రయాణంలో భద్రత అంశంపై ప్రజల్లో ఆందోళన పెరిగింది. మన దేశంలో అతివేగం, డ్రైవింగ్ లోపాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నందున, సరైన సీటును ఎంచుకోవడం కీలకమని నిపుణులు చెబుతున్నారు. మధ్య వరుసలోని.. ఎడమ వైపు ఉన్న సీట్లు ఎక్కువ సురక్షితమని... ముందు వరుస, చివరి వరుస సీట్లు.. కిటికీ పక్కన సీట్లు ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.