సంగారెడ్డిలో ఓ చేసిన పని చూసి ప్రతి ఒక్కరు అతడిని ప్రశంసిస్తున్నారు. బంగారం ధర మండిపోతున్న ఈ రోజుల్లో.. సదరు ప్రయాణికుడు తనకు బస్సులో దొరికిన సుమారు 50 లక్షల విలువైన 39 తులాల బంగారాన్ని తిరిగి యజమానులకు అప్పగించాడు. విశ్రాంత దంపతులు తమ మనవరాలి పెళ్లి కోసం కొన్న బంగారాన్ని పోగొట్టుకోగా, దుర్గయ్య అనే వ్యక్తి దానిని కండక్టర్కు అప్పగించి, అధికారుల ద్వారా వారికి చేరేలా చేశాడు. అతని నిజాయితీని అందరూ ప్రశంసిస్తున్నారు.