రంగారెడ్డి జిల్లా పెంజర్లలో అక్కను హత్య చేసిన తమ్ముడి కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఫోన్లో మాట్లాడుతోందనే నెపంతో ఈ హత్య జరగ్గా.. పోలీసులు దర్యాప్తులో 'ఫేమస్' అవ్వాలనే విపరీత కోరికతోనే రోహిత్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. హత్యకు ముందు 'బాగా చంపి ఫేమస్ అయ్యేదా' అనే డైలాగ్తో ఇన్స్టాగ్రామ్ రీల్ పోస్ట్ చేశాడు.