చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎక్స్లో సంచలన పోస్ట్ చేశారు. మహిళలను చంద్రబాబు పూర్తిగా మోసం చేశారని తీవ్ర విమర్శలు చేశారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ అంటూ సెటైర్లు వేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత సిలిండర్లు అంటూ ఎన్నికల వేళ హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. తమ పాలనలో మహిళలకు కోట్ల రూపాయలు అందిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ వారిని పేదరికంలోకి నెట్టిందని ఆరోపించారు.