దేశవ్యాప్తంగా చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రతతో పాటు పొగమంచు కూడా అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు 'ఆరెంజ్' హెచ్చరికలు జారీ చేశారు.