సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణపై మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీలో అనుమతించినందుకు స్పీకర్కు బుద్ధి లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మానసిక ఆరోగ్యాన్ని కూడా జగన్ ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ.. తాజాగా జగన్ తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం.