పద్మ అవార్డు విజేతలపై అభినందనల వర్షం కురుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఏడుగురికి పద్మ అవార్డులు వరించాయి. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి. వీరితో పాటుగా మరో ఐదుగురికి పద్మ శ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలోనే విజేతలకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. అయితే బాలయ్యకు జగన్ అభినందనలు తెలియజేయటంతో టీడీపీ శ్రేణులు ఓ పాత ఫోటోను వైరల్ చేస్తున్నాయి.