బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడికి కోర్టు మరణశిక్ష విధించింది. బీరు సీసాతో 7 ఏళ్ల బాలికను గొంతు కోసి చంపిన కేసులో 10 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత.. నిందితుడిని దోషిగా తేల్చిన చోడవరం కోర్టు.. అతడికి మరణశిక్ష సరైందని పేర్కొంది. అయితే చోడవరం కోర్టు చరిత్రలోనే తొలిసారి.. దోషికి మరణశిక్ష విధించడం గమనార్హం. ఇంతకీ ఆ బాలిక ఎవరు. ఈ కేసు విషయాలు ఏంటి. కోర్టు అంతటి కఠిన శిక్ష విధించేలా నిందితుడు ఎంతటి దారుణానికి ఒడిగట్టాడు.