మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ వ్యవహారం శ్రుతి మించుతూ ఉండటంతో ఈ ఎపిసోడ్లోకి టీడీపీ, జనసేన పార్టీల అధిష్టానాలు జోక్యం చేసుకున్నారు. ఇరువురు నేతలు వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ ఉండటంపై సీరియస్ అయ్యాయి. ఇరువురు నేతలు సంయమనం పాటించాలని.. ఏవైనా ఉంటే పార్టీ అధిష్టానాల దృష్టికి తీసుకురావాలని సమన్వయ కమిటీ సూచించింది. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది.